ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాలల్లో వసతులపై సుప్రీంలో విచారణ

Andhra Pradesh Telugu |   | Published : Fri, Mar 24, 2017, 04:38 PM

 ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తీసుకున్న చర్యలపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రశ్నించింది. వసతులు, మరుగుదొడ్ల ఏర్పాటు, నీటి సరఫరాపై జులై 24లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణలోని 8,700 ఉపాధ్యాయ ఖాళీలను 8,700 ఖాళీలను మూడు నెలల్లో భర్తీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల భర్తీకి టెట్‌ పరీక్ష నిర్వహించామని.. నియామక ప్రక్రియ చేపట్టాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com