తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రక్క రాష్ట్రాలలోనూ కాటమరాయుడు చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తుంది. తాజాగా కేరళలో ఈ చిత్రం సరికొత్త రికార్డు సృష్టించి అందరిని ఆశ్చర్యపరచింది. ఇప్పటి వరకు ఏ తెలుగు చిత్రం కూడా కేరళలోని పలు ప్రాంతాలలో పదర్శింపబడకపోగా, వాటిని కాటమరాయుడు చెరిపేసింది. తొలిసారి త్రిషూర్ మరియు కసర్గాడ్ ప్రాంతాలలో విడుదలైన తెలుగు చిత్రంగా కాటమరాయుడు రికార్డులు క్రియేట్ చేసింది. కొచ్చి మరియు త్రివేండ్రం ప్రాంతాలలోను ఈ సినిమా ప్రదర్శించబడడం విశేషం. కాటమరాయుడు చిత్రానికి భారీ ప్రీ రిలీజ్ బుకింగ్స్ జరుగుతుండడంతో కొచ్చి లోని మల్టీప్లెక్స్ లో మరి కొన్ని షోస్ ప్రదర్శించాలని థియేటర్ యాజమాన్యాలు భావిస్తున్నాయట. 2014లో విడుదలైన తమిళ చిత్రం వీరమ్ కి రీమేక్ గా కాటమరాయుడు చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. కేరళలో అజిత్, పవన్ కలిసి ఉన్న ఫోటోలతో కటౌట్స్ కూడా వెలుస్తున్నాయి. ఇక ఓవర్సీస్ లోను కాటమరాయుడు ఎక్కువ స్క్రీన్స్ లో విడుదలైన చిత్రంగా రికార్డులు సృష్టించిందని చెబుతున్నారు.