ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీలో కొట్టుకునేంత పని చేసిన ఎమ్మెల్యేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 12:28 PM

ఏపీ అసెంబ్లీ సవాళ్లు, ప్రతి సవాళ్లతో గందరగోళంగా కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో, ఒకానొక సమయంలో ఇరు పార్టీల సభ్యులు అదుపు తప్పారు. స్పీకర్ పోడియం వద్ద ఘర్ణణ వాతావరణం నెలకొంది. పరిస్థితి కొట్టుకునేంత వరకు వెళ్లింది. అర్థం పర్థం లేకుండా గొడవ చేస్తున్నారంటూ వైసీపీ సభ్యులపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని, వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరు కూడా బయటకు రారా తేల్చుకుందాం అంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. ఈ నేపథ్యంలో, చెవిరెడ్డికి మద్దతుగా ఆపార్టీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి వెళ్లారు. చింతమనేనికి అండగా వల్లభనేని వంశీ, ప్రభాకర్ చౌదరిలు నిలిచారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com