ట్రెండింగ్
Epaper    English    தமிழ்

త్వరలో చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 11:57 AM

త్వరలో హైసెక్యూరిటీ ఫీచర్లతో కూడిన చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌లు జారీకానున్నాయి. వీటిని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. రాజ్యసభలో విదేశీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి వీకే సింగ్ ఓ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తూ.. ఈ-పాస్‌పోర్ట్‌ల తయారీ కోసం అవసరమైన పరికరాల సేకరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. నాసిక్‌లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్(ఐఎస్పీ) దీనికోసం త్వరలో గ్లోబల్ టెండర్లను ఆహ్వానించనున్నదన్నారు. దరఖాస్తుదారుడికి సంబంధించిన డిజిటల్ సంతకంతోపాటు ఇతర వివరాలన్నీ చిప్‌లోనే పొందుపరుస్తారని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com