గుంటూరు : గుంటూరు మిర్చి యార్డులో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో జగన్ భేటీ అయ్యారు. మిర్చిరైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నకిలీ విత్తనాల వల్ల పంట దిగుబడి తగ్గిందని రైతులు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి ధరలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట అమ్మితే కూలి ధర కూడా రావడం లేదని, కనీస మద్దతు ధర లేకుంటే తమ పరిస్థితి ఏంటంటూ, ఆత్మహత్యలే శరణ్యమని రైతులు వైఎస్ జగన్ వద్ద వాపోయారు. క్వింటాల్ కు మూడు వేల రూపాయలతో తమకు గిట్టుబాటు కాదని, పంటను రోడ్డుపై వేయడం తప్ప మరో మార్గం లేదని, దళారులందరూ కుమ్మక్కయ్యారని రైతులు వాపోయారు. ఈ మధ్యనే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మార్కెట్ యార్డ్ను సందర్శించారని, ఆ తర్వాత మిర్చి క్వింటాల్ ధర మరింత పడిపోయిందని రైతులు తెలిపారు. అరవై శాతం ధరలు పడిపోయాన్నారు.