ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసెంబ్లీలో `హోదా' హోరు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 02:13 AM

ప్రత్యేక హోదాపై సభలో గందరగోళం


 సభలో చర్చించాలని పట్టుబట్టిన ప్రతిపక్షం హోదా అంశం అవసరం లేదన్న మంత్రి యనమల


అమరావతి, సూర్య ప్రధాన ప్రతినిధి : ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో గందరగోళం నెలకొంది. హోదాపై శాసనసభలో మళ్లీ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం వైకాపా ఎమ్మెల్యేలు ఆందోళన కొనసాగించారు. ఒకసారి తిరస్కరించిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టే అవకాశం లేదని స్పీకర్‌ చెప్పినా వారు వినిపించుకోకుండా ఆందోళన చేపట్టారు. అగ్రిగోల్‌‌డ అంశంపై సీఎం ప్రకటన చేసే సమయంలో ప్రతిపక్ష సభ్యులు సభా కార్యకలాపాలకు అడ్డుతగలడం సరికాదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రతిపక్షం సభలో చర్చ కంటే రచ్చనే కోరుకుంటోందని చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాస్‌ అన్నారు. సభా సమయాన్ని వృథా చేయడం సరికాదన్నారు. అగ్రిగోల్‌‌డ యాజమాన్యానికి వైకాపా అండగా ఉందని, అందుకే సీఎం ప్రకటనను అడ్డుకునేందుకు ప్రయత్ని స్తోందని ఎమ్మెల్యే బోండా ఉమ ఆరోపించారు. బాధి తులపై పట్ల వీరికి కనికరం లేదని విమర్శించారు. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత చర్చ అవసరం లేదని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై తీర్మానం సమయంలో ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారని గుర్తుచేశారు. విపక్షం నిరసనలు, నినాదాలతో ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది.  గురు వారం సమావేశాలు ప్రారంభం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com