అసెంబ్లీ స్థానాల పెంపుపై పార్టీలలో చర్చ! ఏపీ, తెలంగాణలలో జోరుగా చర్చలు జంప్ జిలానీలకు పెరుగుతున్న ఆశలు పాత జిల్లాల ప్రకారమే పునర్విభజనకు అవకాశం పార్లమెంట్ నియోజకవర్గాలు పరిగణలోకి అంటూ మరికొందరు గురువారం తెలంగాణ శాసనసభలో ఎక్కడ చూసినా పెంపుపైనే చర్చ అసెంబ్లీ స్థానాల పెంపునకు చట్ట సవరణ కుదిరితే ఇదే సమావేశాల్లో బిల్లు పాత జిల్లాల ప్రకారమే సీట్ల పెంపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు అసెంబ్లీలు పెంచే ఆలోచన ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి? నేతలందరి మధ్యా ఇదే చర్చ
ఉమ్మడి రాష్ట్రం విడిపోయి రెండు తెలుగు రాషా్టల్రు ఏర్పడిన అనంతరం ఇరు రాషా్టల్రలో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఎలా ఉంటుందన్న ఉత్కంఠ ఇరు రాషా్టల్రలోని రాజకీయ పార్టీలలో నెలకొంది. ఇంత కాలంగా నియోజకర్గ పునర్విభజనపై పార్టీలలో స్తబ్ధుగా ఉన్నా, బుధవారం నాడు కేంద్ర హోం మంత్రి రాజనాథ్సింగ్, అలాగే కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు, హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్లు ఈ విషయంపై ప్రకటనలు చేయడంతో రెండు రాషా్టల్రలోని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు పునర్విభజనపైనే చర్చించుకున్నారు.
హైదరాబాద్, సూర్య ప్రధాన ప్రతినిధి : ఏపీ పునర్విభజన చట్టంలో పొందుపరిచినట్టుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో శాసనసభ స్థానాలు పెంచేందుకు అవసరమైతే చట్ట సవరణ చేపడతామని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్, మరో పక్క వెంకయ్య నాయుడు తెలుపడంతో గురువారం నాడు రెండు రాషా్టల్ర శాసనసభ సమావేశాల్లో సభ్యులంతా ఈ విష యంపై హాట్టాపిక్గా మారింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని 34 అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉన్నది. అలాగే ఏపీలో 50 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. రెండు రాషా్టల్రలో అసెంబ్లీ స్థానాల పెంపు మాత్రం పాత జిల్లా లను ప్రాతిపదికన తీసుకోవాల్సి ఉంటుందని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. తెలంగాణాలో కొత్తగా ఏర్పాటు అయిన 31జిల్లాలను ప్రాతిపదికన తీసుకునే అవకాశం ఏ మాత్రం లేదని కొంత మంది వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం పునర్విభన చేయాలని చట్టంలో లేదంటున్నారు. రాష్ట్ర జనాభాను