ఒంగోలు, మేజర్న్యూస్ : స్థానిక పట్టణంలో నూతనంగా నెలకొల్పిన ఆంధ్ర బ్యాంకు నూతన బ్రాంచ్ను గురువారం ప్రముఖ యువ పారిశ్రామికవేత్త శిద్ధా సుధీర్ ప్రారం భించారు. సాంప్రదాయబద్దంగా జరిగిన ఈ కార్యక్ర మంలో బ్రాంచ్ అధికారులు శిద్ధా సుధీర్ను సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంకు సేవలు ప్రజలు వినియోగించు కోవాలన్నారు. ప్రజలకు అత్యున్నత సేవలు అందిస్తూ దిన దిన ప్రజాధరణ పొందుతున్న ఆంధ్రబ్యాంకు భవిష్యత్తులో కూడా సేవలు విసృ్తత పరచాలన్నారు.
అనంతరం శిద్ధా సుధీర్ను బ్యాంకు అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంకు డీజీఎం రామణ మూర్తి, బ్యాంకు అధికారులు, టిడిపి నాయకులు ఉన్నారు.