న్యూదిల్లీ: గత కొద్దిరోజులుగా బంగారం ధరలో తీవ్ర హెచ్చు తగ్గులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం నాటి బులియన్ ట్రేడింగ్లో బంగారం ధర పడిపోయింది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.350 తగ్గి రూ.29,000కు చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం బంగారం తగ్గుదలకు కారణమని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.41,250 పలికింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం వల్లే వెండి ధర తగ్గుదలకు కారణమైందట.