తిరుపతి :తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ 68మంది విద్యార్థినులకు బంగారు పతకాలు, 1,316మంది విద్యార్థినులకు పట్టాలను, ఇద్దరికి నగదు బహుమతిని అందజేశారు. తిరుపతిలోని తిరుచానూరు పద్మావతి అమ్మవారిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయంలో పద్మావతి అమ్మవారికి పూజలు చేసిన అనంతరం పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థినులకు బ ంగారు పతకాలు, పట్టాలను అందజేశారు.