ముంబయి: మహారాష్ట్రలో రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనను విరమించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కోరారు. సియాన్ ఆసుపత్రి వైద్యుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ‘ డాక్టర్లకు భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్నాము’ అని ఆయన అన్నారు. వెంటనే విధుల్లో చేరాలని ఆయన డాక్టర్లను కోరారు.మహారాష్ట్రలోని సియాన్ ఆసుపత్రిలో ఇటీవల ఓ డాక్టర్పై రోగి బంధువులు దాడి చేశారు. దీంతో గత నాలుగు రోజులుగా రెసిడెంట్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దీనిపై బాంబే హైకోర్టు స్పందించి వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించిన విషయం తెలిసిందే.