ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్రలో రెసిడెంట్‌ డాక్టర్లు ఆందోళనను విరమించాలి : దేవేంద్ర ఫడణవీస్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2017, 04:27 PM

ముంబయి: మహారాష్ట్రలో రెసిడెంట్‌ డాక్టర్లు ఆందోళనను విరమించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కోరారు. సియాన్‌ ఆసుపత్రి వైద్యుడిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ‘ డాక్టర్లకు భద్రత కల్పిస్తామని హామీ ఇస్తున్నాము’ అని ఆయన అన్నారు. వెంటనే విధుల్లో చేరాలని ఆయన డాక్టర్లను కోరారు.మహారాష్ట్రలోని సియాన్‌ ఆసుపత్రిలో ఇటీవల ఓ డాక్టర్‌పై రోగి బంధువులు దాడి చేశారు. దీంతో గత నాలుగు రోజులుగా రెసిడెంట్‌ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దీనిపై బాంబే హైకోర్టు స్పందించి వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com