ధర్మశాల : భారత క్రికెట్ జట్టు హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలకు చేరుకుంది. భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన నాలుగో టెస్టుకు ధర్మశాల ఆతిథ్యమిస్తోన్న సంగతి తెలిసిందే. ఆటగాళ్లతో పాటు కోచ్ అనిల్కుంబ్లే, సిబ్బంది విమానంలో కాంగ్రా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. భద్రతా సిబ్బంది నడుమ ఆటగాళ్లు తమకు కేటాయించిన హోటల్కు బయలుదేరారు. ఈ మేరకు బీసీసీఐ ఓ వీడియోను సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ‘హలో బ్యూటిఫుల్ ధర్మశాల... మేమంతా వచ్చేశాం’ అంటూ బీసీసీఐ పేర్కొంది. కొందరు ఆటగాళ్లు తమ భార్యలతో కలిసి ధర్మశాల చేరుకున్నారు.