ఢిల్లీ : తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. కేజ్రీవాల్ చంద్రబాబు దీక్షా శిబిరం వద్దకు చేరుకొని సీఎం చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన హామీ ఏమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ఆప్ మద్దతుగా ఉంటుందన్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రధాని మోడీ మోసం చేశారన్నారు. ప్రధాని ఒక పార్టీకి కాదని.. దేశానికి ప్రధాని అని మోడీ మరిచిపోయినట్లున్నారన్నారు. హక్కుల కోసం పోరాడితే సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తారన్నారు. కోల్ కతా సీపీపై సీబీఐని ప్రయోగిస్తే మమతా బెనర్జీ అడ్డుకున్నారన్నారు.