అమరావతి : రాబోయే 2019 ఎన్నికల్లో పులివెందుల స్థానం టీడీపీదేనని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు అభివృద్ది, సంక్షేమం, ఆనందం కోరుకుంటున్నారన్నారు. ఆ మూడు నేను ఇస్తున్నప్పుడు మరో పార్టీతో ప్రజలకు పనేముందని చంద్రబాబు అన్నారు. పులివెందులలో పోటీ చేయాలన్న జగన్ సవాల్ పై సీఎం స్పందించారు. జగన్ది ఏడాది జైలుకెళ్లిన నేరచరిత్ర అన్నారు. అవినీతి పరుడిని కుప్పం ప్రజలు ఒప్పుకోరన్నారు.