రాంచీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ లో ఓటమి నుంచి గట్టెక్కడానికి కంగారూలు కిందామీదా పడుతున్నారు. తొలి ఇన్నింగ్స్ లో 152 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ లో నాలుగో రోజే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. చివరి రోజు ఉదయం తొలి గంటలో వికెట్లేమీ కోల్పోలేదు. కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ రెన్షా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ కంగారూ బ్యాట్స్ మెన్ ను ముప్పుతిప్పలు పెడుతున్నారు.