విజయవాడ, సూర్య బ్యూరో : కరువుపై ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు చేపట్టాలని, ఈనెల 25న అనంతపురం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఎపిసిసి అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి అధ్యక్షతన ఒక రోజు సామూహిక దీక్ష చేపడుతున్నట్లు ఎపిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం తెలిపారు. ఆదివారం ఇందిరాభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో పిసిసి అధికార ప్రతినిధి ఎన్.తులసిరెడ్డి ఉపాధ్యక్షులు సూర్యానాయక్, ప్రధాన కార్యదర్శి రవిచంద్రారెడ్డి, అధికార ప్రతినిధి వెంకటరెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకుండా ప్రజలు అండగా ఉంటూ వారి సమస్యలపై నిత్యం పోరాడుతునే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాడే మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలు చెప్పడం జరిగిందన్నారు. విభజన కారణంగా రాష్టం ఎంతో నష్టపోయిందని నాయకులు, కార్యకర్తలు ఎంతో అధైర్యపడ్డారన్నారు. దురదష్టవశాత్తు ఆ విభజన పాపం కాంగ్రెస్ మీద పడిందన్నారు. అయితే ప్రస్తుతం రాష్ర్టంలో కరువు విలయతాండవం చేస్తోంది. తాగడానికి నీరులేక సాగుకు సరిపోయే నీరు దొరక్క రైతులు, ప్రజలు అల్లాడుతున్నారన్నారు. పశు వులకు నీరు, ఆహారం దొరక్క పోవడంతో అవి బక్కచిక్కి ఎందుకు పనికి రాకపోవడంతో కబేళాలకు తరలుతున్నాయన్నారు. దీంతో గ్రామాల్లో వలసలు బాగా ఎక్కువై ఇతర రాష్ట్రాలకు బతుకుతెరువుల కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. ప్రభుత్వం ప్రజలను వారి కర్మలకు వదిలేసి చోద్యం చూస్తోందన్నారు. రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే జిల్లా కలెక్టర్లు సంబంధిత మంు్తల్రు, అధికారులతో సమీక్ష నిర్వహించి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్గ చేశారు. ఇందులో భాగంగా ఈనెల 25న అనంతపురం నగరంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా కరువుపై సామూహిక సత్రాగ్రహాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా కరువుపై సామూహిక సత్యాగ్రహం పేరుతో పోస్టరును రిలీజ్ చేశారు.ఈ కార్యక్రమానికి పిసిసి పదాధికారులతో పాటు ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ పాల్గొంటారని తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయం్త్రం 4 గంటలకు కార్యక్రమం ముగుస్తుందన్నారు.