-కేబినెట్ ఆమోదం ద్వారా ప్రాజెక్టులకు నిధులు వస్తాయి
-రాష్ర్ట అభివృద్ధి రేటు ప్రపంచ దేశాలతో పోల్చడం సరికాదు
-ఆర్థిక మంత్రి యనమల రామకృషూ్ణడు
కాకినాడ, మేజర్న్యూస్ ప్రతినిధి : దేశంలో ఉన్న అన్ని రాషా్టల్రకన్న ఆంధ్ర ప్రదేశ్ అగ్రగామిలో మూలంగా 11.6 శాతం వృద్ధిరేటు చూడడం జరిగిందని ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షల చేస్తున్న విమర్శలు ఆర్థిక అభివృద్ధిపై అవగాహనలేనివని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం తొండంగి మండలం ఎ.వి నగరం గ్రామంలో జరిగిన సమన్వయ సమావేశంలో మంత్రి మాట్లా డుతూ జిఎస్డిపి అభివృద్ధి సూచిక, ఈ అభివృద్ధి సూచికలు ఆయా దేశాలు, రాషా్టల్రలో ఒక్కొక్క విధంగా ఉంటాయని, మన దేశంలో ఉన్న 29 రాషా్టల్రు, యూనియన్ టెర్రిటెర్రీలు కలిపి సరాసరి చేయడం మూలంగా 7.1 శాతం వృద్ధి రేటు చేసారన్నారు. రాష్ట్ర అభివృద్ది రేటు ప్రపంచ దేశాలలో పోల్చ డం సరికా దన్నారు. ప్రపంచంలో చూపడం జరిగిందన్నారు. రాషా్ట్ర అభివృద్ధి రేటు ప్రపంచ దేశాలతో పోల్చడం సరికాదన్నారు. ప్రపంచంలో ఉన్న దేశాలు, వాటి రాషా్టల్రు లేదా ప్రొవిన్సస్ కలిపి సరాసరి లెక్కకట్టడం మూలంగా అభివృద్ధి రేటు, తక్కువగా ఉంటుందన్నారు. అదే విధంగా రాషా్టన్రికి ఇల్స స్పెషల్ అసిస్టెన్సపై కేబినెట్ ఆమోదం ద్వారా ప్రోజెక్టులకు నిధులు వస్తాయని, ఈ నిధులు రాషా్టన్రికి అవసరం అని అన్నారు. రాషా్టల్ర ఆర్గినేజేషన్ చట్టం ఉందని, ప్రతిపక్షం చేసే విమర్శలపై మంత్రి మాట్లాడుతూ రి-ఆర్గనేజేషన్ చట్టంలో కేంద్ర ప్రత్యేక సహాయం ప్రస్ధావన లేదని మంత్రి యనమల అన్నారు. రాషా్టల్రు ప్రతి పక్షాలు కేవలం ప్రత్యర్ధులపై నింధ వేయాలనే దురుద్ధేశ్యంతో వ్యక్తిగత దూషణకు దిగుతున్నారని, విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలని గత 34 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి ప్రతిపక్షాన్ని చూడలేదన్నారు. రాష్ట్రంలో ఇరిగేషన్ పన్నులు గత సంవత్సరంలో 20 వేలు కోట్లతో చేపట్టిందని దీని ననుసరించి ఈ సంవత్సరం బెడ్జట్లో 13 వేల కోట్లు కేటాయించామని రాష్ట్రంలో పోలవరం, పురుషోత్తపట్నం ఎత్తుపోతల పదకాలు అమలులో రాష్ట్ర ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి పనితీరు ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ పురుషోత్తపట్టణం ఎత్తుపోతల పధకాన్ని వచ్చే 9 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ సమన్వయ సమావేశాల ద్వారా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు.