కాకినాడ, మేజర్న్యూస్ ప్రతినిధి : కాకినాడ ప్లాంట్ను విక్రయించేందుకు గ్రూప్నకు చెందిన కోరమాండల్ ఇంటర్నేషనల్తో చర్యలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను నాగార్జున ఫెర్టిలైజర్స అండ్ కెమికల్స లిమిటెడ్ (ఎన్ఎఫ్ సిఎల్) ఒక ప్రకటనలో శనివారం ఖండించింది. కోరమాండల్ ఇంటర్నేషనల్ సహా ఏ ఇతర కంపెనీలతోనూ ఎలాంటి చర్యలు జరపలేదని ఎన్ఎఫ్సిఎల్ స్పష్టం చేసింది. నాగార్జున ఫెర్టిలైజర్సను కొనుగోలు చేసేందుకు కోరమాండల్ ఇంటర్నేషనల్ చర్యలు సాగిస్తోందని ఒక ఫైనాన్షియల్ పత్రి కధనం ప్రచురిం చింది. దీనికి సంబంధించి ఎన్ఎఫ్సిఎల్ వివరణ ఇచ్చింది. కాంప్లెక్స ఎరువు లు, యూరియా ఉత్పత్తిలో కంపెనీని మరింత పటిష్టం చేసేందకు నాగార్జునత ఫెర్టిలైజర్సను కోరమాండల్ చేజిక్కించుకోవాలనిత చూస్తోందని ఒ ఫైనాన్షియల్ పత్రిక పేర్కొంది. డీల్ విలువ రూ.3000-3,600 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. గతంలో ప్రభుత్వ రంగంలోని గోదావరి ఫెరి ్టటైజర్సను కోరమాండల్ ఇంటర్నేషనల్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. రూ.29,500 కోట్ల టర్నోవర్ కలిగిన మురుగప్పా గ్రూప్కు చెందిన కోరమాం డల్ ఇంటర్నేషనల్కు ఆంధ్రప్రదేశ్ కాకినాడ విశాఖపట్నంతోపాటు తమిళనాడు లోని ఎన్నోర్లో ఎరువుల ఉత్పత్తి కేంద్రాలున్నాయి. కాగా కెఎస్ రాజు సారథ్యం లోని ఎన్ఎఫ్సిఎల్కు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో యూరియా ప్లాంట్ ఉంది. భిన్న రంగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న నాగార్జున గ్రూప్లో ఐకిసాన్, నాగా ర్జున ఆయిల్ రిఫైనరీ లిమిటెడ్ కూడా ఉన్నాయి. పాస్పెటిక్ ఎరువుల విభాగంలో కోరమాండల్ అగ్రగామిగా ఉండగా, యూరియా ఉత్పత్తి నాగార్జున ఫెర్టిలైజర్స దేశంలోనే కీలకంగా ఉంది.