న్యూఢిల్లి :కాంగ్రెస్ పార్టీకి కొత్త రూపురేఖలు కల్పించి, బలోపేతం చేయడానికి రాహుల్ గాంధీ మరింత నిర్ణయాత్మకంగా వ్యవహరించాలని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రచారంలో నూతన విధానాలు చేపట్టడం, కొత్త రూపుతో పార్టీని తీర్చదిద్దడం తదితర చర్యల ద్వారా కాంగ్రెస్ను కొంగ్రొత్త పార్టీగా మార్చాల్సి ఉందని ఒక అంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు.