-గృహ నిర్మాణాలకు కావాల్సిన భూమిని ఈ నెలాఖరు నాటికి సేకరించాలి
-మునిసిపల్ కమీషనర్లను కలెక్టర్ ఆదేశం
విజయవాడ, సూర్య బ్యూరో : కృష్ణా జిల్లాలోని అర్బన్ ప్రాంతాల్లో ప్రధానమంత్రి అవాజ్ యోజన క్రింద నిర్మించ తలపెట్టిన గృహ నిర్మాణాలకు కావాల్సిన భూమిని ఈ నెలాఖరు నాటికి సేకరించాలని జిల్లా కలెక్టరు బాబు.ఎ. మున్సిపల్ కమీషనర్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరు తన ఛాంబరులో ఆంధ్రప్రదేశ్ టౌన ్షిప్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు దీవాన్ మైదిన్, మున్సిపల్ కమీషనర్లు, కన్స ల్టెన్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ. మాట్లా డుతూ కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు పట్టణ ప్రాంతాల్లో గహనిర్మాణాలకు ప్రాధా న్యత నిస్తున్న దృష్ట్యా మున్సిపల్ కమీషనర్లు ఆ దిశగా ఆలోచన చేసి కావలసిన భూమికి రెవిన్యూ అధికారులతో సమన్వయంతో సేకరించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు సంబంధించి పద్ధ్దతి ప్రకారం జరగు తుందని ఆ దిశగా పట్టణ ప్రాంతాల్లో చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు. లబి ్దదారుల గుర్తింపులో ఇళ్ళు లేనివారికి ప్రాధాన్యత ఉండాలన్నారు. ఇందుకు ప్రజాసాధికార సర్వే ను ప్రావూణికంగా తీసుకోవాలన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించి డాక్యుమెంటేషన్ పూర్తి అయిన వాటికి కేంద్ర ప్రభుత్వం నిధులు వేగవంతంగా నిధులు మంజూరు చేస్తుందన్నారు. లబ్దిదారుల జాబితాను సిద్ధం చేసి జిల్లా స్థాయి కమీటీ ఆమోదంతో రాష్ర్ట ప్రభుత్వం సిఫార్సులతో కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాబితా ఆమోదంతో గృహ నిర్మాణాలు చేపట్ట డం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో తొమ్మిది మునిసిపాలిటీల్లో డిమాండ్ సర్వే చేపట్టి అర్హత ఉన్నవారిని గుర్తించడంతోపాటు సంబంధిత ధరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్ళు లక్ష్యసాధనలో భాగంగా కార్యచరణ ప్రణాళికను సిద్దం చేసుకొని ఆమోదం పొందాలన్నారు. అర్బన్ ప్రాంతంలో భూసేరణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టరు పర్య వేక్షణ చేస్తారన్నారు. అదేవిదంగా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టరు మున్సిపల్ కమీషనర్లతో సమన్వయం చేసుకొని గృహ నిర్మాణాలకు కావలసిన ప్రక్రియను వేగ వంతం చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు దీవాన్ మైదిన్ వూట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాలకు కావలసిన అనువుతుల తోపాటు అంచనాలు, పర్యవేక్షణ ఉంటుం దన్నారు. గృహ నిర్మాణ పనులకు జియో ట్యాగింగ్ ద్వారా గుర్తించి కావలసిన నిధులు దశలవారీకా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు.
సమావేశంలో జిల్లా జాయింట్ గంధం చంద్రుడు, సబ్ కలెక్టరు డి.బాలాజీ, హౌసింగ్ పీడీ వి.శరత్బాబు తదితరులు పాల్గొన్నారు.