తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి: తిరుమలలో ఇటీ వల జరిగిన తెప్పోత్సవాలు విజయవంత మైనందుకు గాను పాపవినాశనం లోని గంగామాతకు టిటిడి తిరు మల జెఇఓ కె.ఎస్. శ్రీనివాస రాజు ఘనంగా పూజలు నిర్వ హించారు. అనంతరం తెప్పోత్సవాల విజయవంతానికి కృషి చేసిన వివిధ విభాగా లకు చెందిన 300 మంది ఉద్యోగులతో కలిసి జెఇఓ అన్నప్రసాదాలు స్వీకరిం చారు. ఈ సందర్భంగా జెఇఓ మాట్లాడుతూ ప్రతి ఏడాది తెప్పోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని, ఇందు కోసం సిబ్బంది విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు. 2015వ సంవత్సరంలో తిరుమలలో విస్తారంగా వర్షాలు కురిశాయని, శ్రీవారి గంగామాత ఆశీస్సులతో ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురిసి జలాశయాలు నిండాలని ఆకాంక్షించారు. తెప్పోత్స వాలను చక్కగా నిర్వహించిన వాటర్వర్క్స సిబ్బంది సేవలను ఈ సందర్భంగా జెఇఓ కొనియాడారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఎస్ఇ2 రామచంద్రారెడ్డి, ట్రాన్స్పోర్టు జిఎం శేషారెడ్డి, విఎస్ఓ రవీంద్రారెడ్డి, డెప్యూటి ఇఓలు కోదండ రామారావు, రాజేంద్రుడు, బాలాజి, ఝాన్సీ, వాటర్వర్క్స ఇఇ శ్రీనివాసరావు, క్యాటరింగ్ అధికారి జిఎల్ఎన్ శాస్త్రి, డిఇ చంద్రశేఖర్, గార్డెన్ డెప్యూటి డైరెక్టర్ శ్రీనివా సులు, అశ్వని ఆసుపత్రి డాక్టర్లు డాక్టర్ నర్మద, డాక్టర్ కుసుమకుమారి తదిత రులు పాల్గొన్నారు.