ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఫిబ్రవరి 3న పోలియో చుక్కలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 19, 2019, 10:01 PM

రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులకు ఫిబ్రవరి మూడో తేదీన పోలియో చుక్కలు వేయనున్నారు. ఒకే విడతలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా 51,66,690 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకుగాను 37,493 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం కోసం 1,49,977 మందికి శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. రైల్వేస్టేషన్లు, బస్సుస్టేషన్లు, ఇతర ముఖ్య ప్రాంతాల్లోనూ పోలియో చుక్కల కేంద్రాలు అందుబాటులో ఉంటాయి. అప్పుడే పుట్టిన శిశువులు సహా సాధారణ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు కూడా ఈ చుక్కలు వేయించవచ్చని పేర్కొంది.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com