ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘనంగా ప్రారంభమైన అధ్యయనోత్సవాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 18, 2019, 01:00 AM

శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 17వ తేదీ న అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు 24 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. మాఘ మాసంలో ఈ ఆలయంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ఆలయంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారిని, సేనాధిపతివారిని, ఆళ్వార్లను వేంచేపు చేస్తారు. వారి సమక్షంలో దివ్యప్రబంధాన్ని పారాయణం చేస్తారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా జనవరి 27న చిన్నశాత్తుమొర, ఫిబ్రవరి 2న ప్రణయ కలహోత్సవం, ఫిబ్రవరి 6న పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com