న్యూఢిల్లీ : ఆల్ ఇండియా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ (ఏఐసీసీటీయూ) ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. పబ్లిక్ మరియు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ధర్నా నిర్వహిస్తున్నాయి. కార్మికులకు కనీసం వేతనం, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ప్రతాప్గంజ్ పారిశ్రామిక వాడతో పాటు అనేక ప్రాంతాల్లో ఇవాళ కార్మిక సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ఒడిశాలోని నేషనల్ హైవే 16పై ట్రాఫిక్ స్తంభించిపోయింది. భువనేశ్వర్లో కార్మిక సంఘాలు బంద్ పాటిస్తున్నాయి. కేరళలోనూ 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. కొచ్చి, తిరువనంతపురంలో బంద్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో బంద్ సందర్భంగా టీఎంసీ, సీపీఎం కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.