హైకోర్టు విభజన తర్వాత ఏపిలో హైకోర్టు సిఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక విధులు ప్రారంభించడంతో లాయర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అడ్మిట్ అయిన కేసులు ఈరోజు హియరింగ్ ఉంటుందని, కొత్తగా కేసులు కూడా ఫైల్ చేసే అవకాశాల ఉన్నాయని అడ్వకేట్లు చెబుతున్నారు. జీవీఎంసీ రిట్ అప్పీల్ను తొలి కేసుగా సీజే ప్రవీణ్ కుమార్ విచారించారు. చీఫ్ జస్టిస్ బెంచ్కు 42 కేసులు వచ్చినట్టు సమాచారం