నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం కేసులో అబ్దుల్ కరీం తెల్గీ నిర్దోషిగా తేలుస్తూ మహారాష్ర్ట నాశిక్ కోర్టు ఈరోజు తీర్పు వెలువరించింది.. ఈ కేసులో నిందితులంతర్నీ నిర్ధోషులుగా పేర్కొంటూ సంచలన తీర్పు వెలువరించింది.. నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో తెల్గీని 2001 నవంబర్లో అరెస్ట్ చేశారు. నకిలీ స్టాంప్ పేపర్ల రాకెట్ నడిపినట్టు తేలడంతో తెల్గీకి 30 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. జైలు శిక్షతో పాటు అతడికి రూ.202 కోట్ల భారీ జరిమాన కూడా పడింది. ఈ తీర్పుపై తెల్గీ తో సహా ఇతర నిందితులు నాశిక్ కోర్టులో సవాల్ చేశారు.. పరప్పన అగ్రహారం జైల్లో శిక్ష అనుభవిస్తుండగానే గతేడాది అక్టోబర్లో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. కాగా, తెల్గీకి చెందిన పలు ఫోన్లను ట్యాపింగ్ చేయడం ద్వారా కోట్లాది రూపాయల నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం వెలుగులోకి తెచ్చింది. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్రోకరే సంస్థలు సహా వివిధ సంస్థలకు తెల్గీ నకిలీ స్టాంపులు అమ్మేవాడని సిట్ ఆరోపించింది. అయితే వాటికి తగిన ఆధారాలను కోర్టులో సమర్పించకపోవడంతో నిందితులందర్ని ఈ కేసు నుంచి విముక్తి కలిగించింది.