ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగ్నిప్రమాదాల నివారణకు టిటిడి ప్రత్యేక చర్యలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 15, 2017, 12:41 AM

  తిరుమల, సూర్య ప్రత్యేక ప్రతినిధి : వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో టిటిడి అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ డి. సాంబశివరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్న మయ్య భవనంలో మంగళవారం తిరుమల జెఇఓ శ్రీనివాసరాజుతో కలిసి సీనియర్‌ అధికారులతో ఇఓ వారపు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో తిరుమలలో నాలుగు, తిరుపతిలో నాలుగు వాచ్‌ టవర్‌లు ఏర్పాటు చేశామని, ఇక్కడ సిబ్బంది 24 గంటలపాటు అప్రమత్తంగా ఉండి అగ్నిప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందిస్తా రని తెలి పారు. ఇందు కోసం సిబ్బందికి వైర్‌సెల్‌ సెట్లు అందించామని, మంటలను నివారించేందుకు ఫైర్‌ ఫైలింగ్‌ బ్యాచ్‌లో సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు. శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శన టిక్కెట్ల స్కానింగ్‌ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని, తద్వారా మరింత పారదర్శకత పెంచాలని అధికారƒులను ఆదేశించారు. శ్రీవారి ఆలయంలో భక్తులు ఎక్కువ… సేపు నిలబడి ఉండకుండా గంట లోపు దర్శనం చేసుకొని తిరిగి వచ్చేలా చర్యలు చేపట్టాలని ఇంజ నీరింగ్‌, ఆలయ అధికారులను ఇఓ ఆదేశించారు. కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులకు ఆరోగ్య సమస్య లు ఎదురైతే తక్షణం స్పందిం చేందుకు డాక్టర్లు, పారా మెడి కల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచా లని సిఎంఓకు సూచించారు. డోనార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 4 వేల మంది భక్తులు ఆన్‌లైన్‌లో డిజిటల్‌ పాసుపుస్తకాలను పొందారని తెలిపారు. మరింత మంది భక్తులు దీనిని వినియోగించుకోవాలని కోరారు. కాటేజి దాతలు లైఫ్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని, మెయిల్‌ ఐడి, ఫోన్‌ నెంబరు అందిస్తే చాలని అన్నారు. ఆయా కాటేజిలకు వచ్చే ఆదాయ వివరాలను దాతలకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తెలియజేయాలని సూచించారు. వేసవిలో ఎండ వేడినుంచి భక్తులకు ఉపశమ నం కలిగించేలా చలువపందిళ్లు, చలువసున్నం, మాడ వీధుల్లో స్పింకర్ల ద్వారా నీటి పిచికారి చేయాలని, ఆర్‌ఓ ప్లాంట్లలో చల్లని తాగునీరు అందుబాటులో ఉంచాలని ఇఓ ఆదేశించారు. వసతి గదుల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి ఎసిల మరమ్మతులు చేపట్టాలన్నారు. శ్రీవారి సేవకులు నిర్వ హిస్తున్న లడ్డూ కౌంటర్ల లో లడ్డూల కొరత లేకుండా చూడాలని ఆలయ డెప్యూటి ఇఓను ఆదేశించారు. లడ్డూ ట్రేలను శుభ్రం చేసేందుకు మరొక యంత్రాన్ని కొనుగోలు చేయా లన్నారు. ఈ సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజనీర్‌ చంద్ర శేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఎసిఎఓ బాలాజి, విఎస్‌ఓ రవీంద్రారెడ్డి, డెప్యూటి ఇఓలు కోదండ రామారావు, హరీంద్రనాథ్‌, డిఎఫ్‌ఓ శివరామ్‌ప్రసాద్‌, ఆరోగ్య అధికారి డాక్టర్‌ శర్మిష్ట, క్యాటరింగ్‌ అధికారి జి.ఎల్‌.ఎన్‌.శాస్త్రి, ఇడిపి ఓఎస్‌డి బాలాజిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com