ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీకోదండరామాలయ బ్రహ్మోత్సవాల పనులను వేగవంతం చేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 14, 2017, 12:56 AM

మేజర్‌న్యూస్‌, తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయ శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని టిటిడి ఇఓ డాక్టర్‌ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం ఉదయం వారపు సమీక్షలో భాగంగా టిటిడిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ ఒంటిమిట్టలోని శ్రీకోదండరామాలయ శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 5 నుంచి 14వ తేది వరకు జరుగనున్నాయని, ఇందు కోసం విసృ్తతంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్‌ 5న శ్రీరామనవమి, ధ్వజారోహణం, ఏప్రిల్‌ 8న హనుమంత వాహనం, 9న గరుడ వాహనం, 10న శ్రీసీతారాముల కల్యాణం, 11న రథోత్సవం నాడు భక్తులు విశేషంగా విచ్చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా భక్తులకు తాగునీరు అందించేందుకు వీలుగా కొళాయిలు ఏర్పాటు చేయాలన్నారు. కల్యాణం జరిగే ప్రాంతంలో, ఆలయ పరిసరాలలో ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కలిగేలా వాటర్‌ స్పింకర్లతో పాటు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 26 టిటిడి సమాచార కేంద్రాల్లో భక్తులు రూ.300 టిక్కెట్లు పొందే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటి, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులు ఇఓ ఆదేశించారు. భగవద్గీతలోని 30 శ్లోకాలను అర్ధతాత్పర్యంతో అందరికీ తెలిసేలా ఎస్వీబీసీలో ప్రసారం చేయాలన్నారు. కాల్‌ సెంటర్‌ను భక్తులు సులభంగా గుర్తించేలా సప్తగిరి మాసపత్రికలో ముద్రించాలని, ఎస్వీబీసీలో తరచూ ప్రసారం చేయాలని కోరారు. యూట్యూబ్‌లో ప్రసారమయ్యే ఎస్వీబీసీ కార్యక్రమాలకు సంబంధించి మరింత పెంచుకునేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టిటిడిలో ప్రచురితమయ్యే ప్రతి పుస్తకాన్ని టిటిడి సంస్థల గ్రంథాలయాలకు చేరవేయాలన్నారు.
అనంతరం ఎస్వీ సెం్టల్‌ లైబ్రరి అండ్గ రీసెర్‌‌చ సెంటర్‌ కార్యకలాపాలపై ఇఓ సమీక్ష నిర్వహించారు. సెం్టల్‌ లైబ్రరిలో చేపట్టనున్న కార్యక్రమాలపై ఎస్వీసిఎల్‌ అండ్గ ఆర్‌సి శాఖాధిపతి కల్నల్‌ చంద్రశేఖర్‌ మండ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు ఈనిని అత్యాధునిక సంస్థగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా డిజిటల్‌ లైబ్రరీగా తీర్చిదిద్దాలని, టిటిడికి సంబంధించిన పుస్తకాలన్నీ ఆన్‌లైన్‌లో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి తిరుపతి జెఇఓ పోల భాస్కర్‌, ప్రాజెక్టుల ప్రత్యేకాధిఆరి ఎన్‌.ముక్తేశ్వరరావు, అదనపు సివిఎస్‌ఓ శివకుమార్‌ రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏ, సిఎఓ బాలాజి, ట్రాన్‌‌సపోర్‌‌ట జిఎం శేషారెడ్డి, ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ ఎన్‌.వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com