ఢిల్లీ: ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈవీఎంల మీద ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈవీఎంలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయన్న రాహుల్ కొన్ని ఈవీఎంలు హోటల్ రూములో టీ తాగుతున్నాయన్నాయని.. కొన్ని పారిపోయాయని, మరికొన్ని మాయమయ్యాయని అన్నారు. ప్రధాని మోడీ గారి ఇండియాలో, ఆయన హయంలో ఏమైనా జరగొచ్చని అన్నారు. గత మూడు రాష్ట్రాల ఎన్నికల సమయంలో మధ్యప్రదేశ్ లోని ఒక నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు తాము బసచేసిన హోటల్ లోకి ఈవీఎంలను తీసుకెళ్లగా కాంగ్రెస్ నేతలు పట్టుకోవడంతో లెక్కింపు కేంద్రాలకు తరలించారు. ఇక మరోచోట హోంమంత్రి నియోజకవర్గంలోనే ఎన్నికలు జరిగిన మరుసటిరోజు లెక్కింపు కేంద్రాలకు తరలించారు. అప్పటివరకు పోలీస్ స్టేషన్ లో ఉంచారు. వీటి ఉదాహరిస్తూనే రాహుల్ ఈ ట్వీట్ చేసినట్లుగా అనిపిస్తుంది.