తెలుగుదేశం నాయకుడు భూమా నాగిరెడ్డిని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆళ్లగడ్డ చేరుకుంటున్నారు. పలువురు ప్రముఖులు ఈ రోజు ఆళ్లగడ్డలో భూమా భౌతిక కాయానికి నివాళులర్పించారు. తెలుగుదేశం నాయకుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, సోమిరెడ్డి చంద్రశేఖరరెడ్డి తదితరులు భూమా భౌతిక కాయంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.