హరిద్వార్ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇక్కడినుంచి ఢిల్లి వెళ్లే సమయంలో స్వల్పంగా గాయపడ్డారు. హెలికాప్టర్ ఎక్కబోతూ జైట్లీ జారిపడ్డారు. దీనితో ఆయన స్వల్పంగా గాయపడ్డారని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కె తిజరావాలా చెప్పారు. యోగా గురు రామ్దేవ్కు చెందిన పతంజలి యోగాపీఠాన్ని సందర్శించిన అనంతరం ఢిల్లి వెళ్లే క్రమంలో ఆయన జారిపడ్డారు.