ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వ పాఠశాలలకు హైటెక్‌ సొబగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 13, 2017, 01:45 AM

 ఒక టీచర్‌ బోధిస్తే 70 స్కూళ్ల పిల్లలు వినే అవకాశం  దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాలకు అవకాశం  తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి నాణ్యమైన విద్య  తొలి దశలో 280 హైస్కూళ్లలో అమలు  కేంద్ర ప్రభుత్వ ఎర్నెట్‌ సౌజన్యంతో నిర్వహణ మరో 3500 స్కూళ్లలో ఏర్పాట్లు  పాఠశాల విద్యా శాఖకు సీఎం చంద్రబాబు  


అమరావతి నుంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్ర విద్యా శాఖ సాంకేతికత వినియోగంలో విప్లవాత్మక అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలలకు హైటెక్‌ హంగులు అద్దుతోంది. స్మార్‌‌ట బోర్డు టెక్నాలజీ సాయంతో వర్చువల్‌ క్లాస్‌రూమ్‌ బోధనకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ఏదైనా ఓ స్కూల్‌లో ఒక టీచర్‌ ఉండి పాఠాలు చెబుతుంటే ఒకేసారి 70 స్కూళ్లల్లోని విద్యార్థులు వినవచ్చు. ఇందులో కేవలం ఆడియోనే కాకుండా వీడియో కూడా ఉంటుంది. పాఠంలో మధ్యలో విద్యార్థులుకు సందేహాలు వస్తే వెంటనే టీచర్‌ను అడిగి నివృత్తి చేసుకోవచ్చు. ఈ తరహా అధు నాతన బోధన విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. తొలిదశలో నాలుగు జిల్లాల్లోని డైట్‌‌స ఆధ్వర్యంలో 280 హైస్కూళ్లలో ఈ తరహా బోధనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2016-17 విద్యా సంవత్సరంలోనే విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉత్తమ ఉపాధ్యా యులను గుర్తించి శిక్షణ ఇచ్చారు. త్వరలో సుశిక్షితులైన ఆయా టీచర్ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధన జరగనుంది. కేంద్ర ప్రభుత్వ 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com