బాలాసోర్ : ఒడిశా తీరంలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి భారత్ శనివారం బ్రహ్మోస్ సూపర్సానిక్ క్షిపణిని విజయ వంతంగా పరీక్షిం చింది. నెల రోజుల్లో మూడవ సారి ఈ క్షిపణిని పరీక్షించినట్లు డీఆర్డీవో శాస్త్రవేత్తలు తెలిపారు. తాజాగా 450 కిలో మీటర్ల లక్ష్యంగా ఈ ప్రయో గం జరిగిందని చెప్పారు. ఈ బ్రహ్మోస్ క్షిపణిని భారత్ రష్యాతో కలసి అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. మిసైల్ టెక్నా లజీ కంట్రోల్ రెజీమ్ గ్రూప్లో భారత్ తన పరిధిని విస్తరించిన అనంతరం ఈ క్షిపణి పరీక్షను నిర్వహించింది.