మోడీ తిరుగులేని నాయకుడిగా అన్ని వర్గాల ప్రజల అభిమానం చూరగొన్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. మీడియా సమావేశంలో వెంకయ్య మాట్లాడుతూ… బీజేపీకి యూపీలో 39.6, ఉత్తరాఖండ్లో 46.5 శాతం ఓట్లు, మణిపూర్లో 36.2, గోవాలో 34 శాతం ఓట్లు వచ్చాయన్నారు. కాంగ్రెస్ నాయకత్వ లేమితో బాధ పడుతోందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ మరింత బలహీనపడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రజల తీర్పును విపక్షాలు బలపర్చాలన్నారు.