ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీకి ఇది గొప్ప విజయం : రాజ్‌నాథ్ సింగ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 11, 2017, 01:11 PM

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ గొప్ప విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ విజయం దేశ రాజకీయ సమీకరణాలను మార్చబోతున్నదని తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్‌లో బీజేపీ అనుకున్న స్థాయిలో గెలిచిందన్నారు. ఇది బీజేపీ కార్యకర్తల విజయమని చెప్పారు. ఈ రెండు రాష్ర్టాల్లో బీజేపీని గెలిపించిన కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. యూపీలో 310, ఉత్తరాఖండ్‌లో 51 స్థానాల్లో బీజేపీ లీడింగ్‌లో ఉన్నది. మరికాసేపట్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com