న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో బీజేపీ గొప్ప విజయం సాధించిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈ విజయం దేశ రాజకీయ సమీకరణాలను మార్చబోతున్నదని తెలిపారు. యూపీ, ఉత్తరాఖండ్లో బీజేపీ అనుకున్న స్థాయిలో గెలిచిందన్నారు. ఇది బీజేపీ కార్యకర్తల విజయమని చెప్పారు. ఈ రెండు రాష్ర్టాల్లో బీజేపీని గెలిపించిన కార్యకర్తలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. యూపీలో 310, ఉత్తరాఖండ్లో 51 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. మరికాసేపట్లో పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.