పంజాబ్ : పంజాబ్లో అహంకారం ఓడింది.. ధర్మం గెలిచిందని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. పంజాబ్ ప్రజలు ధర్మాన్ని గెలిపించారని తెలిపారు. ఒక్కొక్కరికి కోట్ల కోట్ల ధన్యవాదలు చెప్పినా.. ప్రజల రుణం తీర్చుకోలేమన్నారు. ప్రతి కష్టంలోనూ వెన్నంటి ఉండాలని ప్రజలు తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు.. కనుక పార్టీలు గిర్టీలు లేవు.. అందరం కలిసి నడుద్దామని పిలుపునిచ్చారు. దెబ్బతిన్న పంజాబ్ను మళ్లీ పట్టాలెక్కిద్దామన్నారు. పంజాబ్ను దేశానికి ఉదాహరణగా మార్చాలని అనుకుంటున్నామని చెప్పారు.
కేజ్రీవాల్ ప్రచారంలో నిజాయితీ లేదన్నారు. అందుకే ఓటమి పాలయ్యారు. సోషల్ మీడియాలో కేజ్రీవాల్ ప్రచారానికి పంజాబ్ ప్రజలు సరైన బుద్ధి చెప్పారని తెలిపారు. దుష్టులను ఎప్పటికైనా భగవంతుడు శిక్షిస్తాడు అని అన్నారు. నిస్వార్థంతో పోరాటం చేస్తే ఎప్పుడైనా తమదే విజయమన్నారు. ఈ విజయాన్ని సోనియా గాంధీ, రాహుల్కు కానుకగా ఇస్తున్నామని చెప్పారు. విజయం కార్యకర్తలదని స్పష్టం చేశారు. 35 ఏళ్ల వయసు వరకు 25 ఏళ్లు భారత్ తరపున క్రికెట్ ఆడాను. ఐదుసార్లు ఎంపీగా గెలిచాను, తనకు ఇంకా ఏం కావాలి? ఇప్పుడు తనకు కావాల్సిందల్లా పంజాబ్ అభివృద్ధి మాత్రమేనని స్పష్టం చేశారు