కృష్ణా: జిల్లాలో శుక్రవారం సాయంత్రం భారీగా వర్షాలు కురిశాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమైపోయాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వీరులపాడు మండలం కోణతాలపల్లి సమీపంలో పిడుగుపడి నరాల సీతారామరెడ్డి (52) అనే వ్యక్తి మృతి చెందాడు. చందర్లపాడు మండలం కాండ్రపాడు పంట పొలాల్లో పిడుగుపడి ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిని ఆస్పత్రికి తరలించారు. నందిగామ మండలంలోనూ ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.