ఢిల్లీ: రాజకీయ పార్టీల విరాళాలపై కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా పలు ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు వ్యతిరేకంగా రూ.2వేలు మించి నగదు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నట్టు హెచ్చరించింది. దేశంలో నల్లధనం అరికట్టేందుకు నగదు రహిత విరాళాలు సేకరించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ నసీం జైదీ రాజకీయ పార్టీలకు సూచించారు. ఎన్నికల్లో నల్లధనం వినియోగాన్ని అరికట్టడమే పార్టీల లక్ష్యం కావాలని ఆయన ఓ ఇంటర్వ్యూలో పిలుపునిచ్చారు.