హైదరాబాద్: మహేశ్బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఫస్ట్లుక్ కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో చిత్ర ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ సెట్లో మహేశ్బాబును క్లిక్మనిపించిన ఫొటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. దీన్ని దర్శకుడు మురుగదాస్ షేర్ చేస్తూ.. ‘ఆన్ ది వే..’ అని ట్వీట్ చేశారు. అంటే.. త్వరలోనే మహేశ్ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు విడుదల కానున్నాయన్న మాట. అయితే ఈ చిత్రం టైటిల్, ఫస్ట్లుక్, డిజిటల్ పోస్టర్ను రెండు వారాల్లో విడుదల చేయనున్నారని సినీ వర్గాల సమాచారం.