కాకినాడ: చిరంజీవి కాంగ్రెస్లోనే ఉన్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు రెండు నెలల ముందు చిరంజీవి ప్రచారంలో పాల్గొంటారన్నారు. మహాకూటమి తెలంగాణకే పరిమితమని, ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగానే వెళ్తుందని ఆయన పేర్కొన్నారు. పొత్తులు ఢిల్లిd పెద్దలు చూసుకుంటారన్నారు. జగన్పై దాడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. దాడిని మూడు పార్టీలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయని విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు.