ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దివాలా దిశలో బ్యాంకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 10, 2017, 12:21 PM

హైదరాబాద్.మార్చ్.10(RNI):దేశంలోని బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగ్గొట్టి కొందరు విలసంగాను మరికొందరు పెద్దమనుషులు గాను జీవిస్తుంటే వారినుండి వేలకోట్ల  రుణాలను తిరిగి  జమచేయించలేక బ్యాంకుల అధికారులు వెనకడుగు వేస్తుంటే ఒకవైపు బ్యాంకులు అనేకం నష్టాల్లోకి వెళుతుండగా మరోవైపు పెద్దనోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు రోజుకోకటిగా విధించిన ఆంక్షలు వలన ఖాతాదారులు బెంబేలెత్తుతున్నారు.కస్టపడి సంపాదించిన పైకం పదిలంగా ఉంటుందని బ్యాంకుల్లో దాచుకుంటే ఆధార్ కార్డ్ లింక్ వలన ఆదాయపు పన్ను శాఖ నుండి తాఖీదులు రావటం సామాన్యులకు భయం ఆందోళనలు కలిగిస్తుంటే మరోవైపు తాము దాచుకున్న డబ్బులు అవసరానికి ఎ టీ ఎం ల ద్వార సకాలం లో వస్తాయని నమ్మకం లేక అసలు బ్యాంకు లో డిపాజిట్ చెయ్యటం మానివేసినట్లు ఫలితంగా ఒకొకరోజు డిపాజిట్ క్యాష్ రాక లావా దేవీలు నిలిచిపోతున్నాయని బ్యాంకు వర్గాలు ఆందోళన వ్యక్తం చేసాయి. ఇదే కొనసాగితే బ్యాంకుల మనుగడ కష్టంగా మారి తమ ఉద్యోగ భద్రతకి భంగం వాటిల్లె ప్రమాదం ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేసాయి.పులిమీద పుట్ర లా ఏప్రిల్ మొదటి తేదీ నుండి మినిమం బాలన్స్ లేకుంటే పెనాలిటి విధిస్తామనే ప్రకటన తో ఒకటికంటే ఎక్కువ వున్న బ్యాంకు అకౌంట్లు రద్దుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది.దేనితో కొత్తగా డెపోజిట్లు రాక, వున్నా ఖాతాలు పోయి బ్యాంకులు సంక్షోభం లోనికి నెట్టబడుతున్నాయని ఆర్ధిక రంగ నిపుణులు కొందరితో అర్ ఎన్ ఐ ప్రతినిధులు చర్చించినప్పుడు ఆందోళన వ్యక్తం చేసారు.మినిమం బాలన్స్ లేకుంటే పెనా లిటి విధించే బ్యాంకులు వాటి ఏ టీ ఏం లలో నగదు నిల్వలు మైంటైన్ చెయ్యకుండా. కాతా దారులను వేధించటం ఏమిటని తమ ఏ టీఎం లలో నగదు లేనప్పుడు ఖాతాదారులకు పెనాలిటీ చెల్లియిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు.ఏమైనా ప్రభుత్వం పెద్ద నోట్లు ఏ ఉద్దేశంతో రద్దు చేసిందోగాని రెండువేల నోటు ప్రవేశపెట్టి బ్లాక్ మనీ దారులకు తేలికగా దాచుకొని వేలు కలిగిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.కారణం రెండువేల నోట్లు చెలామణి లోనికి రాకపోవటమే.తాజాగా అందిన సమాచారం మేరకు ఈరోజు నగదు కొరతతో 80 శాతం ఏ టీ ఎం లు మోటబడివున్నాయని, వున్నా 20 శాతం ల వద్ద కూడా భారీ సంఖ్యలో బారులు తీరి వున్నా వినియోగ దారులు అభద్రతా భావంతో తమవరకు అబూ ఉంటుందో లేదో తెలియక ఆందోళన చెండుతున్నట్లు మా ప్రతినిధులు వివిధ ప్రాంతాలనుండి తెలియ చేస్తున్నారు.ఇప్పటికే డిపాజిట్లు సగం పైగా తగ్గిపోవటం,విత్ డ్రా లు పెరగటం వలన బ్యాంకులు సంక్షోభం వైపు వెళుతున్నాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.RNI/TH/10.00






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com