విజయవాడ : జగన్ కేసులు ఎందుకు నత్త నడకన నడుస్తున్నాయని, ఏ అజ్ఞాత శక్తి జగన్ కు సాయం చేస్తుందో కేంద్రం సమాధానం చెప్పాలని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ సీబీఐ, ఈడీ, కేంద్ర హోంమంత్రి, లా మినిష్టర్ జగన్ కేసుల విచారణపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ఆస్తుల కేసుల విచారణలో సీరియస్ నెస్ ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు. 11 కేసులలో నిందితుడిగా ఉన్న జగన్ స్వేచ్ఛగా, స్వాతంత్రం గా ఎలా తిరుగుతున్నాడో ప్రధాని సమాధానం చెప్పాలన్నారు. మీ పార్టీ మనుగడ కోసం, టీడీపీని ఇబ్బంది పెట్టాలనే ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. బలమైన సాక్ష్యాలున్న కేసులను త్వరితగతిన విచారణ పూర్తయేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నీతులు చెప్తూ చీకటి వ్యక్తులతో జత కడుతోందని ఆరోపించారు. జగన్ కు శిక్ష పడకుండా మోడీ జోడీ తో పాటు ఏ శక్తి ఆపలేదని ధీమా వ్యక్తం చేశారు.