ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అర్హులైన వారందరికీ అర్హులకు కొత్త రేషన్ కార్డులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 23, 2018, 03:13 PM

నియోజకవర్గ పరిధిలోని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట మండలం లో కొత్తగా మంజూరు అయిన 59 రేషన్ కార్డులను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. కొత్తగా రేషన్ కార్డులను కావాలనుకునేవారు ముందుగా ఆధార్ నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం పాత కార్డుల్లో వారి పేర్లు తొలగించు కొని సాధికారిక సర్వే చేయించుకోవలన్నారు.ఈ విధానం లో ఎక్కడ లోపమున్న కార్డు జరికాదన్నారు.ఈ అంశాలను లబ్ధిదారులు గమనించాలని కోరారు. ఇవ్వన్నీ పూర్తియైన కార్డుల వివరాలు సంబంధిత విఆర్ ఓ లు అప్లోడ్ చేయాలని దీంట్లో ఆశ్రద్ద వహించవద్దని సూచించారు.59 మంది కి కొత్తగా కార్డులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కేవీవి సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దార్ వేదవల్లి, ఆర్ ఐ శేషు కుమారి,అసిస్టెంట్ ఆర్ ఐ మెడిశెట్టి హరి,వి ఆర్ ఓ లు,టీడీపీ నాయకులు కొచ్చర్ల కోట నరసింహారావు,సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com