అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కడప ఎస్పీ బాబూజీ అట్టాడకు విశాఖ రూరల్ ఎస్పీగా, చిత్తూరు ఎస్పీ రాజశేఖర్ బాబుకు గుంటూరు రూరల్ ఎస్పీగా, విశాఖ రూరల్ అడిషినల్ ఎస్పీ ఐశ్వర్య రాస్తోగికి నెల్లూరు ఎస్పీగా, విశాఖ లా అండ్ ఆర్డర్ డిసిపి ఫకీరప్పకు కర్నూల్ ఎస్పీగా, తిరుపతి అర్బన్ ఎస్పీ అభిషేక్ మహంతికి కడపకు, పార్వతీపురం ఓఎస్డీ విక్రాంతి పాటిల్కు చిత్తూరుకు, చిత్తూరు ఓఎస్డీ అన్బురాజన్కు తిరుపతి అర్బన్ ఎస్పీగా, విశాఖ రూరల్ ఎస్పీ రాహుల్దేవ్ శర్మకు విశాఖ సిట్కు, గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు విజయవాడ లా అండ్ ఆర్డర్ కు బదిలీ, నెల్లూరు ఎస్పీ పిహెచ్డి రామకృష్ణకు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరోకు, కడప అడిషనల్ ఎస్పీ అద్మాన్ నయీం అస్మీకు విశాఖ లా అండ్ ఆర్డర్కు బదిలీ అయ్యారు. కర్నూల్ ఎస్పీ గోపినాథ్ జెట్టికి టిటిడి సెక్యూరిటీ, విజిలెన్స్ బాధ్యతలు, నర్సీపట్నం ఓఎస్డీ సిద్ధార్ధ కౌశల్కు గుంతకల్ రైల్వే ఎస్పీగా బాధ్యతలు, వెయిటింగ్లో ఉన్న రవీంద్రనాధ్ బాబుకు విశాఖ లా అండ్ ఆర్డర్ బాధ్యతలు అప్పగించారు.