అభివృద్ధిలో సాంకేతికతదే పైచేయిగా ఉంటుందని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. విశాఖ ఫిన్టెక్ ఫెస్టివల్లో చంద్రబాబు ప్రసంగిస్తూ అన్ని రంగాల్లో సాంకేతికంగా అందిపుచ్చుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో రియల్ టైమ్ గవర్నెన్స్ ఉందని ఆయన అన్నారు. దీనికోసం రాష్ట్రంలో 13 కేంద్రాలు పని చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాలన మొత్తాన్ని కంప్యూటరైజ్డ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. సంక్షేమం, నియంత్రణ, అభివృద్ధి తదితర అన్ని అంశాలను రియల్ టైమ్లో మానిటర్ చేయడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.