ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ రైల్వే జోన్‌ వచ్చే అవకాశాల్లేవు : జివిఎల్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 23, 2018, 11:10 AM

హైదరాబాద్‌ : విశాఖ రైల్వే జోన్‌ వచ్చే అవకాశాలు ఎంతమాత్రం లేవని బిజెపి ఎంపి జివిఎల్‌ నరసింహారావు చెప్పారు. కడపలో ఉక్కు పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానిదే వైఫల్యమని ఆయన అన్నారు. ఎపికి ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్‌ తీసుకోలేదని ఆయన అన్నారు. ప్రత్యేక ప్యాకేజీ గొప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఎపిలో బిజెపిని విలన్‌ను చేయడమే చంద్రబాబు లక్ష్యమని ఆయన అన్నారు. రాష్ట్రంపై కాని, చంద్రబాబుపై కాని మోడీకి ఎందుకు కోపం ఉంటుంది? జివిఎల్‌ ప్రశ్నించారు. ఎపికి 2 లక్షల కోట్లపైనే ఎపిఎకి నిధులు కేంద్రంనుంచి వచ్చాయని ఆయన చెప్పారు. అన్ని రాష్ట్రాల్లోజరిగినట్లే ఎపిలోనూ ఐటి సోదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. తాను ఎవరిపైనా ఎక్కుపెట్టిన బాణాన్ని కాదని స్పష్టం చేశారు. ఎపి బిజెపిలో తన వల్ల ఎవరూ జీరోలు కాలేదని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాలలోనూ బిజెపి బాగా బలపడుతుందని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com