శ్రీకాకుళం జిల్లాకు అండగా నిలుద్దామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీకాకుళం వి.కన్వెన్షన్ హాలులో పార్టీ నేతలు, కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాతో తనకు చాలా అనుబంధం ఉందన్నారు. శ్రీకాకుళం ప్రజల ఆవేదన బయటి ప్రపంచానికి తెలియదని పేర్కొన్నారు. సమస్యలు ఉన్న చోటే జన సైనికులు ఉండాలన్నారు. ప్రజలకు మేలు చేసే దిశగానే అడుగులు వేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.