తుఫాన్ బాధితులపై కేంద్రానికి సానుభూతి లేదని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వైసీపీ రెచ్చగొట్టి అడ్డంకులు పెడుతోందన్నారు. పవన్ ఒడ్డున ఉండి గుడ్డలు వేస్తున్నాడన్నారు. సహాయక చర్యలను అడ్డుకునేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందన్నారు. కేటీఆర్ వేరే రాష్ట్రంలో ఉండి పవన్ ను అభినందిస్తున్నాడన్నారు. బీజేపీ, జనసేన, వైసీపీ, టీఆర్ఎస్ లు టీడీపీని టార్గెట్ చేస్తున్నాయన్నారు. మనం రాష్ట్రం కోసం పోరాడుతున్నామన్నారు. ప్రతిపక్షాలు మనపై పోరాటం చేస్తున్నాయన్నాయని చంద్రబాబు అన్నారు.