టెక్కలి: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. బుధవారం సీఎం శ్రీకాకుళం జిల్లా టెక్కలి చేరుకున్నారు. కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, టెక్కలి మండలాల్లోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. ప్రజల సమస్యలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకోనున్నారు.