కడప జిల్లాలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు కొనసాగుతున్నాయి. వారోత్సవాలను పురస్కరించుకుని ఉమేష్ చంద్ర కళ్యాణమండపం నందు మెగా రక్త దాన శిబిరం ఏర్పాటు చేశారు. జిల్లా అడిషినల్ ఎస్పీలు అద్నాన్ నయీమ్ అస్మి, శ్రీనివాస రెడ్డి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కడప డిఎస్పీ మాసుం బాషా, అడిషినల్ ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి రక్తదానం చేశారు.